నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా టీఆర్ఎస్ గురువారం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని బంగారిగడ్డ నుంచి చండూరు మండలం వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివ రావు సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పక్కా లోకల్.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్ అని అన్నారు. 2018లో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని, మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సేవకుడిగా నిలుస్తానని, నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని కూసుకుంట్ల స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY