మునుగోడు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. కౌంటింగ్ ప్రారంభం అయ్యాక రెండు, మూడు రౌండ్లలో మినహా మిగిలిన అన్ని రౌండ్లలో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 3,100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 6620 బీజేపీకి 6088, కాంగ్రెస్కి 907 ఓట్లు లభించాయి. దీంతో ఇప్పటివరకు టీఆర్ఎస్ కు మొత్తం 52,343, బీజేపీకి 49,243, కాంగ్రెస్ కు 14596 ఓట్లు లభించాయి.
ఏడో రౌండ్:
- టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 7202 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 45723
- బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 6803 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 43155
- కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు: 1664 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 13689
ఆరో రౌండ్:
- టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 6016 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 38521
- బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 5378 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 36352
- కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు: 1962 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 12025.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE