దేశంలో గత 24 గంటల్లో మొత్తం 1,55,015 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1132 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.73 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,60,579 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.
అలాగే కొత్తగా మరో 14 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,500 కి పెరిగింది. మరో 1,479 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,15,240 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో14,839 (0.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (నవంబర్ 5 (8am)–నవంబర్ 6 (8am)):
- మహారాష్ట్ర – 219
- కేరళ – 200
- తమిళనాడు – 119
- కర్ణాటక – 109
- ఢిల్లీ – 68
- తెలంగాణ – 66
- రాజస్థాన్ – 52
- ఉత్తర్ ప్రదేశ్ – 45
- పశ్చిమబెంగాల్ – 43
- గుజరాత్ – 41
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE