శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు (ఆగస్టు 18, గురువారం) ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనునట్టు మంగళవారం నాడు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. అయితే వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టీటీడీ ముందుగా ప్రకటించిన నేపథ్యంలో, అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY