మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు (అక్టోబర్ 13, గురువారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. కాగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బుధవారం వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ నుంచి చండూర్ వరకు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు.
అలాగే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా హాజరుకానున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అక్టోబర్ 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY