టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగార్జున ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా అడవిని దత్తత తీసుకున్నారు. 1000 ఎకరాలలో ‘అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్’ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అడవిని దత్తత తీసుకుంటున్నట్లు నాగార్జున ప్రకటించారు. అయితే, ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి వెళ్లి వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున భార్య అమల, నాగ చైతన్య, అఖిల్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ