తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావును, సభ్యులుగా సీహెఛ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే.కిషోర్ గౌడ్ లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ మరియు సభ్యులంతా సెప్టెంబర్ 1, బుధవారం ఉదయం 10 గంటలకు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మరియు సభ్యులు సీహెఛ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే.కిషోర్ గౌడ్ లు ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బీసీ కమీషన్ సహాయ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ