హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కాగా 82వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్ ఎగ్జిబిషన్) నేడే (జనవరి 1, ఆదివారం) ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనను ఆదివారం సాయంత్రం మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ప్రజలకు ఎంతో సుపరిచితం అయిన నుమాయిష్ నూతన సంవత్సరం రోజున ప్రారంభం అయ్యేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
జనవరి 1వ తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సంవత్సరం నుమాయిష్ లో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ సహా పలు రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. నుమాయిష్ ను నేటి నుంచి ఫిబ్రవరి 15వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. అలాగే ప్రవేశ రుసుం రూ.40 గా నిర్ణయించారు. ఇక నుమాయిష్ కు వచ్చే వారి కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE