ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయంలో బీజేపీకి చెందిన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తదితరులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం బయట ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించటం విశేషం. ఆయన ప్రసంగం లోని కొన్ని ముఖ్యమైన అంశాలు..
- పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు.
- తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన ప్రతీ ఒక్కరికీ నా శ్రద్ధాంజలి.
- మీ అందరి ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం.
- కుటుంబ పార్టీలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి.
- తెలంగాణ కోసం త్యాగాలు చేసింది ఒక్క కుటుంబం కోసం కాదు,
- ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూఢ నమ్మకాలను నమ్ముతోంది, కానీ నేను నమ్మేది ఒక్కటే.. అదే అభివృద్ధి.
- బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు నా దృష్టికి వచ్చాయి, తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీ పోరాడుతుంది
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ