రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15 గంటలకు హకీంపేట నుంచి రాష్ట్రపతి కోవింద్ డిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
[subscribe]