సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మంగళవారం ఈ ఘటనపై పలువురు పోలీస్ అధికారులతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సమీక్ష నిర్వహించారు. అనంతరం నిందితుడు రాజు గాలింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి లేదా అరెస్ట్ కు క్లూ అందించిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఫొటో మరియు కొన్ని ఆనవాళ్లతో ప్రకటన విడుదల చేశారు. నిందితుడి సమాచారాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ (9490616366), టాస్క్ ఫోర్స్ డీసీపీ (9490616627) కు తెలియజేయాల్సిందిగా ప్రకటనలో సూచించారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజును పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ