గత డిసెంబర్ 1 న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసింది. ఈరోజు తారీఖుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గెజిట్ ను జారీ చేశారు. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి గెలుపొందిన అభ్యర్థులు పేర్లు, పార్టీ మరియు రిజర్వేషన్ల సహా ఇతర వివరాలను గెజిట్ లో పేర్కొన్నారు.
మరోవైపు ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. తాజాగా అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడంతో త్వరలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కూడా నోటిఫికేషన్ జారీ కానుంది. 150 డివిజన్లలో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ 2 గెలుచుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ