ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి 3352 కేంద్రాల్లో తొలిరోజున 191,181 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొత్తం 16,755 మంది సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు. తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ లో పాల్గొన్న వారు ఎవరు కూడా అనంతరం ప్రతికూల ప్రభావంతో ఆసుపత్రిలో చేరిన ఘటన ఇప్పటివరకు నివేదించబడలేదని పేర్కొన్నారు. అలాగే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు.
In the world’s largest #COVID19 vaccination program, 191,181 beneficiaries were vaccinated across the country today. pic.twitter.com/elw6s32fja
— Ministry of Health (@MoHFW_INDIA) January 16, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ