తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిల్లో సోమవారం మరియు మంగళవారం నాడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. కేయూ పరిధిలో అక్టోబర్ 19, 20వ తేదీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు, ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసి, వాటీని అక్టోబర్ 21, 22వ తేదీలలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 19, 20వ తేదీలలో జరగాల్సిన బీఈడీ దూరవిద్య పరీక్షలను నవంబరు 2, 3వ తేదీలలో జరపనున్నారు.
అదేవిధంగా ఓయూ పరిధిలో 19 నుంచి 21 తేదీలలో జరిగే పరీక్షలను మాత్రమే వాయిదా వేశారు. అక్టోబర్ 22 నుంచి పరీక్షలను యథాతథంగా జరుగుతాయని, పరీక్షలు పూర్తిగా వాయిదా పడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు వాయిదా వేసిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇక జేఎన్టీయూ పరిధిలో కూడా వర్షాల ప్రభావంతో 19 మరియు 20న నిర్వహించే పరీక్షలను వాయిదావేస్తున్నట్టు వీసీ తెలిపారు. మిగతా అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu