సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. ఈ సంవత్సరం కూడ కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి ముందు కార్మికులకు బోనస్ చెల్లిస్తుంటారు, ఆ పద్ధతిలో గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువుగా ఈసారి బోనస్ ప్రకటించారు. గత సంవత్సరం సింగరేణి యాజమాన్యం కార్మికులకు రూ.60,500 చొప్పున బోనస్ గా చెల్లించగా, ఇప్పుడు ఒక్కో కార్మికుడికి 64,700 రూపాయలను బోనస్ గా ఇస్తున్నారు. పిఎల్ఆర్ కింద ఈ బోనస్ మొత్తాన్ని అక్టోబర్ 25, శుక్రవారం నాడు కార్మికులకు చెల్లించబోతున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 48 వేల మందికి పైగా కార్మికులు బోనస్ పొందనున్నారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]