దీపావళి కానుకగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 బోనస్

Deepavali Bonus For Singareni Employees, Mango News Telugu, Political Updates 2019, Singareni Employees To Get 64700 Deepavali Bonus, Singareni Employees To Get Deepavali Bonus, Singareni Employees To Get Deepavali Bonus Of Rs 64700, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. ఈ సంవత్సరం కూడ కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి ముందు కార్మికులకు బోనస్ చెల్లిస్తుంటారు, ఆ పద్ధతిలో గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువుగా ఈసారి బోనస్ ప్రకటించారు. గత సంవత్సరం సింగరేణి యాజమాన్యం కార్మికులకు రూ.60,500 చొప్పున బోనస్ గా చెల్లించగా, ఇప్పుడు ఒక్కో కార్మికుడికి 64,700 రూపాయలను బోనస్ గా ఇస్తున్నారు. పిఎల్ఆర్ కింద ఈ బోనస్ మొత్తాన్ని అక్టోబర్ 25, శుక్రవారం నాడు కార్మికులకు చెల్లించబోతున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 48 వేల మందికి పైగా కార్మికులు బోనస్ పొందనున్నారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =