సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులలో ఎవరికైనా కరోనా సోకితే.. వారికోసం ప్రత్యేకంగా 7 రోజులు సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 7 రోజులు సెలవులను హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారికోసం ప్రత్యేకంగా ఇవ్వనుంది. ఈ 7 రోజుల ఐసోలేషన్ తర్వాత యధావిధిగా విధుల్లోకి రావచ్చని యాజమాన్యం తెలియజేసింది.
ఇప్పటికే, సింగరేణి వ్యాప్తంగా 900 మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 100 కు పైగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. పెర్మనెంట్ ఉద్యోగుల్లో దాదాపు 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంకోవైపు మరో 400 మందికి పైగా వారి కుటుంబ సభ్యులకి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం కరోనా సోకిన ఉద్యోగులకు ఈ విధమైన సెలవులు మంజూరు చేసింది. కేంద్రం నిర్ణయించిన కరోనా మార్గదర్శకాల ప్రకారం 7 రోజుల ఐసోలేషన్ సెలవులను ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF