దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,57,484 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1569 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో రోజువారి పాసిటివిటీ రేటు 0.44 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370 కు చేరుకుంది. అలాగే కొత్తగా 19 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,260 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, కేరళ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 2,467 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,25,84,710 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 19 వేలకుపైగా (16,400 – 0.05%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మే 16 (8am)–మే 17 (8am)):
- ఢిల్లీ – 377
- కేరళ – 321
- హర్యానా – 218
- ఉత్తర్ ప్రదేశ్ – 138
- మహారాష్ట్ర – 129
- కర్ణాటక – 98
- రాజస్థాన్ – 69
- గుజరాత్ – 33
- తమిళనాడు – 31
- తెలంగాణ – 28
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF