ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రకటించింది. ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ వివరించారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394 మందికి చేరినట్టుగా తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు కోటీ 97 లక్షల 21 వేల 514 ఉండగా, మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది ఉన్నట్టు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో ఎన్ఆర్ఐ ఓటర్లు 7,436, ట్రాన్స్జెండర్ ఓటర్లు 4,066 మంది ఉన్నారని చెప్పారు. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత కొత్తగా లక్షా 63 వేల 30 మంది ఓటర్లు నమోదుచేసుకున్నారని కె.విజయానంద్ వెల్లడించారు. కొత్తగా పెరిగిన ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉండడం విశేషం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం 45,836 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్స్ ఉండగా ఇప్పుడు 45,836 పోలింగ్ కేంద్రాలకు కుదించినట్టు తెలిపారు.
[subscribe]