పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టీకాంగ్రెస్ ఫైర్.. 12 మందిపై మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు

T-Congress Leaders Complaint on Defection of 12 MLAs in Moinabad PS Today,T-Congress Leaders,Complaint on Defection,12 MLAs in Moinabad PS Today,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆ పార్టీ నుంచి గెలిచి అధికార టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం మొత్తం 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి ముందు సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు మరికొందరు సీనియర్ నేతలతో దీనిపై సమాలోచనలు జరిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కేవలం వారి రాజకీయ, ఆర్థిక ప్రయెజనాలను ఆశించి మాత్రమే టీఆర్ఎస్‌లోకి వెళ్లారని అభిప్రాయానికి వచ్చిన నేతలు వచ్చే ఎన్నికల్లో వారు మళ్లీ పోటీ చేయకుండా అడ్డుకోవాలని నిశ్చయించుకున్నారు.

అలాగే ఈ 12మంది ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కూడా యోచిస్తున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతల సంతకాలతో కూడిన లేఖను మొయినాబాద్ పోలీసులకు అందజేశారు. పార్టీ మారే క్రమంలో ఈ ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి ముడుపులు, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు అందుకున్నారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి ఆ 12మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టీకాంగ్రెస్ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =