తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ముగిసిన ఫిజికల్ ఈవెంట్స్, తుది పరీక్షలకు అర్హత ఎంతమందంటే?

SI Constable Recruitment in Telangana PMT-PET Events Completed Final Written Exams Start from March 12th,SI Constable Recruitment in Telangana,PMT-PET Events Completed, Final Written Exams Start from March 12th,Mango News,Mango News Telugu,TSLPRB PMT Events,TSLPRB PET Events,Telangana Physical Tests,Physical Tests For SI,Physical Tests For Constable Posts,Telangana SI Posts,Telangana Constable Posts,Telangana SI,Telangana Constable,Telangana Superendent Inspector,Telangana Constable Posts Latest News and Updates,Telangana News and Live Updates

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల్లో భాగంగా కీలకమైన రెండోదశలో అభ్యర్థులకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)) జనవరి 5, గురువారంతో పూర్తయ్యాయి.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటిదశలో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించి, ఫలితాలను వెల్లడించిన అనంతరం ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 2,37,862 మంది వ్యక్తిగత అభ్యర్థులకు డిసెంబర్‌ 8వ తేదీనుంచి పీఎంటీ/పీఈటీ ఈవెంట్స్ నిర్వహించారు.

డిసెంబర్ 8 నుంచి హైదరాబాద్ లో (24 రోజులు), నల్గొండ (23 రోజులు), రాచకొండ (23 రోజులు), సైబరాబాద్ (22 రోజులు), వరంగల్ (22 రోజులు), ఖమ్మం (22 రోజులు), మహబూబ్ నగర్ (22 రోజులు), కరీంనగర్ (20 రోజులు), నిజామాబాద్ (11 రోజులు), ఆదిలాబాద్ (10 రోజులు), సిద్దిపేట (10 రోజులు) మరియు సంగారెడ్డిలో (9 రోజులు) రోజులు పాటుగా పీఎంటీ/పీఈటీ ప్రక్రియ నిర్వహించబడి, జనవరి 5న విజయవంతంగా ముగిసిందన్నారు. మొత్తం అన్ని వేదికల్లో పీఎంటీ/పీఈటీ కోసం 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారని, ఫైనల్/తుది రాత పరీక్ష రాసేందుకు అర్హులు అయ్యారని టీఎస్‌ఎల్‌పీఆర్బీ తెలిపింది. ఈ సంఖ్యలో చిన్నపాటి మార్పులు/చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు.

పీఎంటీ/పీఈటీ ప్రక్రియ ముగిసిన అనంతరం 554 సివిల్ ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు (41,256 పురుషులు మరియు 11,530 మంది మహిళలు) పోటీలో ఉన్నారు. అలాగే 15,644 సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకుగాను 90,488 (67,606 మంది పురుషులు మరియు 22,882 మంది మహిళలు) పోటీలో ఉన్నటు తెలిపారు. 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్‌ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌ పోస్టులకు 9003 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన పోస్టులకు సంబంధించి తుది పరీక్షలకు అర్హత సాధించిన వారి సంఖ్య వివరాలకు కూడా టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మరోవైపు మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 23 వరకు తుది రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సై తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా ఏప్రిల్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 23వ తేదీన సివిల్, ట్రాన్స్​పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =