కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు రేపు (మే 21, శుక్రవారం) విడుదల కానున్నాయి. పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షలు రద్దు కారణంగా విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్-1 (ఎఫ్ఏ-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయించనున్నారు. ఎఫ్ఏ-1 కు 20 మార్కులు కేటాయించగా, విద్యార్థులకు అందులో వచ్చిన మార్కులను 100కి లెక్కించి గ్రేడులను కేటాయిస్తారు. రాష్ట్రంలో మొత్తం 5,21,398 మంది పదో విద్యార్థులకు సంబంధిచిన ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ