తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండురోజులుగా స్వల్ప అస్వస్థత ఉండడంతో సోమవారం నాడు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు తెలిపారు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ