భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకర్గం నుంచి వరుసగా 1985,1989,1994 ఎన్నికల్లో సీపీఎం పార్టీ తరపున కుంజా బొజ్జి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిస్వార్థమైన సేవతో ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ నాయకుడిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. అలాగే గిరిజనల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా సొంత ఇల్లు లేని అరుదైన నేతగా ఆయన నిలిచారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో ఉంచారు. కుంజా బొజ్జి మృతి పట్ల పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ