తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాల్లో భాగంగా జీహెచ్ఎంసీ సవరణ బిల్లు -2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు-2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు- 2020, ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ)-2020 లను రాష్ట్రమంత్రులు కేటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాల సవరణ బిల్లులపై చర్చించిన అనంతరం, ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అలాగే బిల్లుల ఆమోదం తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu