ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. “కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచనమేరకు నా స్వీయనిర్బంధ కాలం పూర్తయింది. ఈ రోజు ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నాను” అని ఉప రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
“స్వీయనిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతో మంది నా ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేశారు. అన్ని ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారు. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. కరోనా సంక్రమణ సమయంలో నాకు అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. నాకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన నా వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు” అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu