కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు

Telangana Govt Sanction an Amount of Rs 100 Cr for Development of Kondagattu Anjaneya Swamy Temple,CM KCR Appointed Dr Ediga Anjaneya Goud as Chairman of Telangana Sports Authority,KCR Appointed Dr Ediga Anjaneya,CM KCR,Dr Ediga Anjaneya Goud,Chairman of Telangana Sports Authority,Mango News,Mango News Telugu,Telangana BRS Govt,Rythu Bandhu,Telangana Rythu Bandhu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ ఆల‌య అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 సంవత్సరానికి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యకలాపాల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి పథకం కింద కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లను మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి పనుల జాబితాను మంజూరు చేసిన మొత్తంలో అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్‌ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. “రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seven =