తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 సంవత్సరానికి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యకలాపాల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి పథకం కింద కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లను మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి పనుల జాబితాను మంజూరు చేసిన మొత్తంలో అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. “రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE