తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం

2021 Telangana Assembly Budget Session, Budget Session, Mango News, Telangana Assembly, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2021, Telangana Assembly Budget Session News, Telangana Assembly Budget Session will Start, Telangana Assembly Budget Sessions, Telangana Assembly Budget Starts, Telangana Assembly Budget Starts Today, Telangana Assembly Session, Telangana Budget Assembly session, Telangana budget session, Telangana Budget Session 2021-2022

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 15, సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. సమావేశాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్య‌క్ష‌త‌న బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ బీఏసీ సమావేశంలో స‌మావేశాల పూర్తి ఎజెండా, బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటుగా నిర్వహించాలో కూడా నిర్ణయించనున్నారు. ఇక మార్చ్ 17వ తేదీన గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరుగనుంది. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చ్ 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =