అక్టోబర్ 13 న శాసనసభ, అక్టోబర్ 14 న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సమావేశాలను మంగళవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ సహా మొత్తం నాలుగు చట్టాల సవరణ బిల్లులను ఈ రోజు సభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ సవరణ బిల్లులకు శనివారం నాడు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది.
నూతన రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ చట్టం-1955 సవరణ బిల్లు, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్ట సవరణ బిల్లు, భూముల ధర నిర్ధారణలో సబ్ రిజిస్టార్స్ కున్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్ స్టాంప్ చట్టానికి సవరణ బిల్లును ఈ రోజు సభలో ప్రవేశపెట్టి, చర్చించిన అనంతరం ఆమోదం తెలుపనున్నారు. బిల్లులను శాసనసభ ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఇక శాసనసభలో ఆమోదం పొందిన చట్ట సవరణ బిల్లులను, రేపు శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu