తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడుపుకునేందుకు ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై మంత్రివర్గం చర్చిస్తున్నటుగా తెలుస్తుంది. ఆర్టీసీ చార్జీల వివరాలు, బస్సు ప్రయాణాల విధివిధానాలపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం లాక్డౌన్ సడలింపులు, తాజా నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వివరించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu