తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 20 వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే మార్చ్ 8న 2020-21 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు (మార్చ్ 7, శనివారం) సాయంత్రం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ లోని అంశాలపై చర్చించనున్నారు. అనంతరం బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా శాసనసభలో ప్రవేశపెట్టే తీర్మానం, జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), కొత్త రెవెన్యూ చట్టం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. అలాగే 10 రోజులకు పైగా సాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చర్చించాల్సిన ఇతర అంశాలు మరియు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు.
[subscribe]