ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్చ్ 7న షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల జరిగే విధంగా షెడ్యూల్ ను ప్రకటించారు. అయితే మార్చ్ 29 వరకు ఎన్నికలు జరుగుతుండడంతో ప్రభుత్వం మార్చ్ 7, శనివారం నాడు పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చ్ 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్
- మార్చ్ 31: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
- ఏప్రిల్ 1: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
- ఏప్రిల్ 3: సెకండ్ లాంగ్వేజ్ పేపర్
- ఏప్రిల్ 4: ఇంగ్లీష్ పేపర్-1
- ఏప్రిల్ 6: ఇంగ్లీష్ పేపర్-2
- ఏప్రిల్ 7: మ్యాథమేటిక్స్ పేపర్-1
- ఏప్రిల్ 8: మ్యాథమేటిక్స్ పేపర్-2
- ఏప్రిల్ 9: జనరల్ సైన్స్ పేపర్-1
- ఏప్రిల్ 11: జనరల్ సైన్స్ పేపర్-2
- ఏప్రిల్ 13: సోషల్ స్టడీస్ పేపర్-1
- ఏప్రిల్ 15: సోషల్ స్టడీస్ పేపర్-2
- ఏప్రిల్ 16: ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2
- ఏప్రిల్ 17: ఒకేషనల్ కోర్స్ థియరీ.
[subscribe]