తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కేసుల పెరుగుదల సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాటపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా లాక్డౌన్ విధింపుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ విధించడం వలన ఏర్పడే పరిస్థితులు, రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ మీద లాక్డౌన్ విధిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ