తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చే అవకాశముంది. రాష్ట్రాల మధ్య మరియు జిల్లాల్లో ఆర్టీసీ సేవలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ముందుగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే లాక్డౌన్ 4.0 కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసింది. కొత్తగా కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి నిచ్చారు. అయితే రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడుపుకునేందుకు, ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే అధికారం ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఆయా జిల్లాల అధికారులు నిర్ణయించనున్నారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా, వేటికి అనుమతి ఇవ్వకుండా కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలుచేయాలనీ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu