రాష్ట్రంలో జరుగుతున్న వరిధాన్య సేకరణపై బుధవారం ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై సీఎం ఆరాతీసారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామని అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నదని, తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చైన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్ ను ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ మరోసారీ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF