తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి సిద్దిపేట గ్రామీణ మండలం బుస్సాపూర్ లో బయో-సీఎన్జీ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, చెత్తను తడి, పొడి, హనీకర చెత్తగా ప్రజలు విభజన చేయడం వల్లే బయో-సీఎన్జీ ఏర్పాటు సాధ్యం అయ్యిందని చెప్పారు. గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయాయని, సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే బయో-సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రజల భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో స్వచ్చ పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దుతామని చెప్పారు. బయో-సీఎన్జీ గ్యాస్ ను పట్టణంలో రెస్టారెంట్ లకు సరఫరా చేస్తామని, మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తామని చెప్పారు. సేంద్రీయ ఎరువులను రైతులకు ఎరువుగా అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంకు సిద్దిపేట దిక్సూచిగా నిలిచినట్లే అభివృద్ధికి కూడా దిక్సూచిగా నిలపాలని ప్రజలను మంత్రి హరీశ్ రావు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ