ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కోనసీమ జిల్లా పేరును మార్చనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కోనసీమ పేరుతో జిల్లా ప్రకటించినప్పటి నుంచి డాక్టర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని దళితుల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపాయి. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.
అయినా ప్రభుత్వం వారి ఆందోళనలను పట్టించుకోకపోవడంతో అధికార వైసీపీకి చెందిన పలువురు దళిత నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలోనే.. ఏపీ ప్రభుత్వం జిల్లా పేరును ”బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ గా పేరు మార్చటానికి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం రాత్రి లోపు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను జారీ చేయనుందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF