సెప్టెంబర్ 14, సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామిని కలిసి పరామర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటుగా మైహోం గ్రూపు ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu