ప్రముఖ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ వాకబు చేశారు. ఇటీవల చెన్నైలోని ఓ ఆసుపత్రిలో రోజా రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, అలాగే ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కాగా సీఎం కేసీఆర్ తనకు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేయడంపై ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ