జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. “48 వ సీజేఐగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు. మీ విశేష అనుభవం దేశానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాను. మీ పదవీకాలం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఆగస్టు 26, 2022 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారమానంతరం వారంతా జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ