తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. కాగా వ్యక్తిగత పర్యటనలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం ఢిల్లీలో సీఎం కేసీఆర్ దంత వైద్యులను కలువనున్నట్టు సమాచారం. ఇటీవలే ఓసారి సీఎం కేసీఆర్ ఢిల్లీలో దంత వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో చికిత్సలో భాగంగా మరోసారి నేడు వైద్యులను కలవనున్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ తో పాటుగా పలువురు కుటుంబసభ్యులు కూడా వెళ్లనున్నారు. అయితే సీఎం ఢిల్లీ పర్యటన, తిరిగి హైదరాబాద్ కు ఎప్పుడు చేరుకోనున్నారనే విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ