వివాహంతో సంబంధం లేకుండా మహిళలకు అబార్షన్ చేయించుకొనే హక్కు మహిళలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అబార్షన్ రైట్స్ మహిళలపై గౌరవనీయులైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెలువరించిన ల్యాండ్మార్క్ ప్రో-ఛాయిస్ తీర్పును హృదయపూర్వకంగా అభినందించండి మరియు స్వాగతించండి’ అని పేర్కొన్నారు. ఎంటీపీ చట్టం ప్రకారం భారతీయ మహిళలందరికీ సురక్షితంగా గర్భం తీయించుకొనే హక్కు ఉందని స్పష్టం చేసిన కోర్టు, 24 వారాల వరకు గర్భం తొలగించుకోవచ్చని హక్కు కల్పించిన సంగతి తెలిసిందే.
Wholeheartedly applaud & welcome the landmark Pro-Choice judgement delivered by the Hon’ble Supreme Court of India on the #AbortionRights women👏👏
— KTR (@KTRTRS) September 30, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY