యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

KCR Visited Yadadri Temple, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, Yadadri Temple Development Works
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావొస్తున్నా నేపథ్యంలో త్వరలో అక్కడే జరపబోయే మహాసుదర్శన యాగం ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆలయంలో నిర్మాణాలు, టెంపుల్‌ సిటీలో పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు యాగ నిర్వహణకు అనువైన ప్రాంతాన్ని సీఎం ఎంపిక చేయనున్నారు. అలాగే ఆలయ సమీపంలో చేపడుతున్న కాటేజీల నిర్మాణ పనులను కూడా పరిశీలిస్తారు. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి పూర్తీ స్థాయిలో పునరుద్ధరణ పనులు చేపట్టి, మహాకుంభాభిషేకం నిర్వహణ, యాగ నిర్వహణ చేపట్టే విధంగా ఆలయ అధికారులు, సిబ్బందితో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి, అందుకు తగిన సూచనలు చేసే అవకాశముంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =