తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఆదివారం రాత్రి కూడా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాసంగిలో వరి కొనుగోలు, పెట్రోల్, డీజీల్ రేట్లు, దళిత బంధు, రైతు చట్టాలు, రాష్ట్ర బీజేపీ నాయకుల విమర్శలు, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై గంటకుపైగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు తనపై, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కాగా మరుసటి రోజే మళ్ళీ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ