తెలంగాణ రాష్ట్రంలో మరో 1078 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 2, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 59,705 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఆరుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1712 కి పెరిగింది. కరోనా నుంచి మరో 331 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,02,207 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,900 యాక్టీవ్ కేసులు ఉండగా, వారిలో 3,116 మంది హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్ లో ఉన్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1078):
- జీహెచ్ఎంసీ ఏరియా – 283
- మేడ్చల్ మల్కాజిగిరి – 113
- రంగారెడ్డి – 104
- నిజామాబాద్ – 75
- సంగారెడ్డి – 46
- నిర్మల్ – 40
- జగిత్యాల – 40
- కరీంనగర్ – 34
- నల్గొండ – 33
- వరంగల్ అర్బన్ – 27
- ఆదిలాబాద్ – 25
- మహబూబ్ నగర్ – 24
- కామారెడ్డి – 23
- మంచిర్యాల – 21
- ఖమ్మం – 20
- యాదాద్రి భువనగిరి – 15
- రాజన్న సిరిసిల్ల – 15
- సిద్దిపేట – 14
- సూర్యాపేట – 13
- నాగర్ కర్నూల్ – 12
- జయశంకర్ భూపాలపల్లి – 12
- మెదక్ – 12
- పెద్దపల్లి – 11
- వికారాబాద్ – 10
- వనపర్తి – 10
- వరంగల్ రూరల్ – 8
- జోగులాంబ గద్వాల్ – 8
- జనగామ – 8
- నారాయణ్ పేట్ – 7
- మహబూబాబాద్ – 6
- భద్రాద్రి కొత్తగూడెం – 6
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- ములుగు – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ