జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన గ్రామ, మండల, జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రగతి భవన్ లో సన్మానించారు.
వీరిలో కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామ సర్పంచ్ మడది భారతి, రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ గ్రామ సర్పంచ్ తెడ్డు అమృత, సిద్దిపేట జిల్లా మిట్టపెల్లి గ్రామ సర్పంచి వంగ లక్ష్మి, సిద్దిపేట జిల్లా మల్యాల గ్రామ సర్పంచ్ దరిపల్లి వజ్రవ్వ, ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి గ్రామ సర్పంచ్ పుండ్రు పోతారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్ గ్రామ సర్పంచ్ కే. శైలజ, పెద్దపల్లి జిల్లా సుందిల్ల గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మి, రాజన్నసిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ, జగిత్యాల జిల్లా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, పెద్దపల్లి జిల్లాల ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణ, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్లోళ్ల మంజూశ్రీ, సంగారెడ్డి జడ్పీ సీఈఓ సీహెచ్ ఎల్లయ్య, పెద్దపల్లి డీపీఓ గీత ఉన్నారు.
ఈ సందర్భంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావులను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ లు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ