ఆంధ్రప్రదేశ్ కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 18, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261 కు చేరింది. ఈ నేపథ్యంలో కడప జైలులో ఖైదీలు, సిబ్బంది కూడా కరోనా బారిపడ్డారు. గత రెండు రోజులుగా జైలులో 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 317 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 303 మంది ఖైదీలు కాగా, 14 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసి, కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నట్టుగా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఏంజీ నాయక్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu