తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 206 నమోదు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, Coronavirus updates Live, COVID-19, India COVID 19 Cases, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కొత్తగా నమోదైన 206 కేసులతో కలిపి జూన్ 6, శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3048 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

కొత్తగా రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ ఏరియాలో 152 కేసులు, మేడ్చల్ లో 18, రంగారెడ్డి‌ జిల్లాలో 10, నిర్మల్, యాదాద్రి జిల్లాలలో 5 చొప్పున, మహబూబ్ నగర్ లో 4, జగిత్యాల, నాగర్ కర్నూలులో 2 చొప్పున, మహబూబాబాద్, వికారాబాద్, జనగామ, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో జిల్లాలలో ఒక్కో కేసుతో కలిపి మొత్తం 206 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. అలాగే కొత్తగా నమోదైన 10 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 123 కి చేరినట్టు తెలిపారు.

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 448 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 448 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,496 కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1710 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1663 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =