తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాడు 17,296 శాంపిల్స్ పరీక్షించగా, 502 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో నవంబర్ 15, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,57,876 కి చేరింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1407 కి పెరిగింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 141, రంగారెడ్డి జిల్లాలో 72, మేడ్చల్ లో 33, సంగారెడ్డిలో 26, భద్రాద్రి కొత్తగూడెంలో 23, కరీంనగర్ లో 22, సిద్ధిపేటలో 21 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 15, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 48,91,729
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,57,876
- కొత్తగా నమోదైన కేసులు : 502
- నమోదైన మరణాలు : 3
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,42,084
- కరోనా రికవరీ రేటు: 93.87%
- యాక్టీవ్ కేసులు: 14,385
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 11,948
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ