భారత్ బయోటెక్ సంస్థ తమ కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఒక్కో డోసును రూ.400 కు అందించనున్నారు. “ఈ సమయంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన మహమ్మారి పరిస్థితులపై భారత్ బయోటెక్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థకు ఉన్న అపారమైన సవాళ్లను గుర్తించి కోవాక్సిన్ వ్యాక్సిన్ ను ఒక్కో డోసుకు రూ.400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచుతున్నాము”అని భారత్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ముందుగా కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.600 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోసుకు రూ.1200 చొప్పున విక్రయించనున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. అయితే రాష్ట్రాలకు, కేంద్రానికి వ్యాక్సిన్ అందించే ధరల్లో వత్యాసం ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం వ్యాక్సిన్ ధరలు తగ్గించాలంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలోనే రాష్ట్రప్రభుత్వాలకు వ్యాక్సిన్ ధర తగ్గింపుపై భారత్ బయోటెక్ నుంచి ప్రకటన వెలువడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ