తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 591 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 2, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,45,997 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,807 కి పెరిగింది. కొత్తగా 643 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,33,371 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కరీంనగర్ లో 75, జీహెచ్ఎంసీ పరిధిలో 68, ఖమ్మంలో 58, వరంగల్ అర్బన్ లో 51, పెద్దపల్లిలో 32, నల్గొండలో 31, జగిత్యాలలో 31, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 30 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 2, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,21,97,450
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,45,997
- కొత్తగా నమోదైన కేసులు : 591
- నమోదైన మరణాలు : 2
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,33,371
- కరోనా రికవరీ రేటు: 98.04%
- యాక్టీవ్ కేసులు: 8,819
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3807
- కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ